కేరళ షూటింగ్ లో ఉన్నప్పుడే నాన్న చనిపోయారు!
on Jun 6, 2023
సిక్స్త్ సెన్స్ సీజన్ 6 షోకి "హిడింబ" టీం నుంచి నలుగురు సెలబ్రిటీస్ వచ్చారు. అశ్విన్ బాబు - విద్యురామన్, నందిత శ్వేతా -సాహితి వచ్చారు. ఫస్ట్ రౌండ్ ఆడాక సెకండ్ రౌండ్ లో ఎగ్ బ్రేక్ చేస్తున్నప్పుడు నందిత శ్వేతాకి వన్ సెకండ్ అని చెప్పి ఆపేసారు ఓంకార్." మీరెంత స్ట్రాంగ్..మీరు స్ట్రాంగ్ అవడానికి మెయిన్ రీజన్ ఏమిటి" అని అడిగాడు. "చిన్నప్పటినుంచి నా డెసిషన్స్ నేనే తీసుకునేదాన్ని. చాల స్ట్రగుల్స్ ఫేస్ చేసాను. ఇంకో విషయం చెప్పాలంటే హిడింబా షూటింగ్ టైంలో మా నాన్నకు ఒంట్లో బాలేదు. హాస్పిటల్ లో చేర్పించాను. అక్కడ నాన్నను చూసుకోవడం, మళ్ళీ షూట్ కి రావడం అలా చేసేదాన్ని. ప్రొడ్యూసర్ గారు అప్పటికి చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఈ మూవీని ఎలా ఐనా కంప్లీట్ చేయాలని..షూటింగ్ కోసం కేరళ వెళ్లాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే అది చేస్తేనే మూవీ పూర్తవుతుంది అనే పరిస్థితి వచ్చింది.
అప్పుడు హాస్పిటల్ కి, షూట్ కి తిరగలేక నాన్నకు రెస్ట్ తీసుకోమని చెప్పే షూటింగ్ కి వచ్చేసాను. అప్పుడు నా చేయి పట్టుకుని ఏడ్చారు. నాకు చాల బాధగా అనిపించింది. కానీ నాకు మూవీస్ అంటే ఎంత ఇష్టమో ఎంత కమిట్మెంట్ తో పని చేస్తానో ఆయనకు తెలుసు. అలా తప్పనిసరి పరిస్థితిలో షూటింగ్ కి కేరళ వెళ్ళా,. అక్కడ ఒక వారం రోజులు షూట్ ఉంది. అప్పుడు ఐదో రోజున నాన్న చనిపోయారనే వార్త వచ్చింది. ఐనా నేను వెళ్ళలేదు నా కమిట్మెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్ళా. అప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అన్న విషయం తెలిసింది. నా వల్ల ఎంత అయ్యిందో అంత వరకు చూసుకున్నాను. ఆయన హాస్పిటల్ లో ఉన్నప్పుడు హిడింబ మూవీ స్టోరీ కూడా వినిపించాను. మా మూవీ టీం మొత్తానికి ఆయన బ్లేసింగ్స్ ఎప్పుడూ ఉంటాయి" అని ఏడుస్తూ చెప్పింది నందిత శ్వేతా.. తర్వాత ఒక ఎగ్ బ్రేక్ చేసి లక్ష రూపాయలు గెలుచుకుంది.
Also Read